గుండాల/ఆళ్లపల్లి2(మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండల కేంద్రానికి చెందిన ఎస్కే అన్వర్ గత కొంతకాలంగా అనారోగ్య కారణంతో ఇబ్బంది పడుతుంటే పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సీఎం సహాయనిధి నుండి రెండు లక్షల రూపాయల ఎల్ ఓ సి నో ఇప్పించారని టిఆర్ఎస్ పార్టీ ఆళ్ళపల్లి మండల అధ్యక్షులు కాయం నరసింహారావు పేర్కొన్నారు. మండలంలో ఇప్పటివరకు సీఎం సహాయనిధి నుండి పెద్ద ఎత్తున చెక్కులు మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. సమస్యను రేగా దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే స్పందిస్తూ ఆర్థిక సహాయం అందించడం ఆనందంగా ఉందని మండల అధ్యక్షులు నరసింహారావు, మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం పేర్కొన్నారు
Post A Comment: