మన్యం మనుగడ, మణుగూరు/బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని పినపాక పట్టి నగర్ గ్రామం నందు ఏర్పాటుచేసిన క్రీడా మైదానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు శుక్రవారం నాడు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు.
యువత చదువుతో శారీరకంగా దృఢంగా ఉండాలన్నారు, అప్పుడే వారిలో జ్ఞాపక శక్తితో పాటు ఆత్మ స్థైర్యం పెంపొందుతుందనే ఉద్దేశంతోనే గ్రామాలలో క్రీడా ప్రాంగణాల ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు సదుపాయాలు కల్పించి వారి నైపుణ్యం ప్రదర్శించే అవకాశం కల్పిస్తుందన్నారు.
క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు, సీఎం కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ఎకర విస్తీర్ణంలో క్రీడా మైదానాల ను నిర్మించాలని నిర్ణయించారన్నారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: