మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రైటర్ బస్తీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు నూతనంగా ఏర్పాటు చేశారని, కార్యాలయం ప్రారంభోత్సవం ఈనెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్ రేగా చేతుల మీదుగా ప్రారంభించబడుతుంది అని, టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి తెలియజేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి పినపాక మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కావున మండల వ్యాప్తంగా గల ఎంపీపీ, జెడ్ పి టి సి, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, పిఎసిఎస్ చైర్మన్, ఆత్మ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు, సర్పంచులు , ఉప సర్పంచులు, టిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తప్పకుండా ప్రారంభోత్సవానికి రావాలని ఆయన తెలియజేశారు.
Post A Comment: