మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తి నందు నూతనంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ విప్ కార్యాలయాన్ని 24వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంభిస్తున్న సందర్బంగా అశ్వారావుపేట తెరాస పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు మాట్లాడుతూ అశ్వరావుపేట మండల వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుకున్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ, సొసైటీ చైర్మన్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, కౌన్సిలర్ లు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్ లు, వైస్ ఎంపీపీ లు, సొసైటీ వైస్ చైర్మన్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, మండల కో ఆప్షన్ సభ్యులు, సొసైటీ డైరెక్టర్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లు, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు, వార్డ్ నెంబర్ లు, అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామ శాఖ అధ్యక్షు, కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
Navigation
Post A Comment: