మన్యం మనుగడ వాజేడు జూన్ 21:
గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీలో జాతీయ రహదారి 163 ఇరువైపుల మొక్కలు నాటుతున్న సర్పంచ్,పాయం విజయలక్ష్మి, సిబ్బంది ప్రతీ గ్రామంలో మొక్కలను నాటి అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించడం సామాజిక బాధ్యత అని సర్పంచ్ పాయం విజయలక్ష్మి అన్నారు. హరితహారానికి సమా యత్తం అవుతున్న నేపథ్యంలో గ్రామాలల్లో, ఇప్పటి నుంచే కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ పాయం విజయలక్ష్మి 163 జాతీయ రహదారి ఇరువైపులా, గ్రామంలోని ఖాళీ స్థలాల్లో 100 పైగా మొక్కలు నాటారు. రాబో యే తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టాలని సర్పంచ్ అన్నారు. ప్రతీ మొక్క వృక్షంగా ఎదిగే వరకు కాపాడే బా ధ్యత గ్రామస్థులదేనని, వారి సహకారంతో అభివృద్ధి సాధ్యమన్నారు.
Post A Comment: