మన్యం మనుగడ, పినపాక :
మండల పరిధిలోని ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన అడపా పద్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో వైద్య ఖర్చుల నిమిత్తం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.11 వేలు ఆర్దిక సహాయం అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం రూ.11 వేలు నగదు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏడూళ్లబయ్యారం సర్పంచ్ కోరం రజిని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలిశెట్టి పిల్లారాయుడు, పోతునూరి సంతోష్, పాపాల వీరబాబు, జక్కం నరేష్, యన్నంపల్లి రవి, గుండు రమేష్, బోగిబోయిన కృష్ణ, విజయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: