మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 04 మండలకేంద్రం లోని ఎల్లంకి గార్డెన్స్ నందు నిర్వహించిన మండల స్థాయి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైరా నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మంగీలాల్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ, రైతన్నలకు భరోసాగా నిలవడానికి వరంగల్ గడ్డకు 6 వతారీకున విచ్చేస్తున్న మన ప్రియతమ నేత ఏ.ఐ.సీ.సీ. అగ్రనేత రాహుల్ గాంధీకి, పి.సి.సి. అధ్యక్షులు రేవంత్ రెడ్డికి మరియు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లకు. ఘన స్వాగతం పలుకుతూ, రైతు సంఘర్షణ సభను జయప్రదం చేయడానికి జూలూరుపాడు మండలం లోని రైతన్నలు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొనవలసిందిగా పేరుపేరునా స్వాగతం పలుకుతూ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు నున్నా కృష్ణయ్య, బోడ్డు కృష్ణయ్య, కారటి నవీన్, మండల నాయకులు మంద బాబు, తాళ్లూరి అచ్చయ్య, వాంకుడోత్ కిషన్ నాయక్, గూగులోత్ శ్రీను. తదితర నాయకులు పాల్గొన్నారు..
Post A Comment: