CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.....

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం గానుగపాడు సహకార సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు సబ్సిడీపై వచ్చిన పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను రైతులకు ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... జిల్లాలో రైతుల కోసం 1200 క్వింటాలు పిల్లి పెసర, 5,300 క్వింటాలు జిలుగులు, 600 క్వింటాలు జనుములువిత్తనాలను సొసైటీలు,ఆగ్రోస్ సంస్థల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. పంట మార్పిడి విధానం ద్వారా రైతులు తమ వ్యవసాయభూముల్లో పంటల దిగుబడిని సాధించవచ్చన్నారు. పచ్చిరొట్ట ఎరువుల వల్ల కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడమే కాకుండా పెట్టుబడిని తగ్గించుకోవచ్చన్నారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కోసం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి, 24 గంటల ఉచిత విద్యుత్ తో నిరంతరాయంగా నీళ్లు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, ఎంపీపీ భానోత్ పార్వతి, డైరెక్టర్లు ఉన్నం నాగరాజు, పసుపులేటి వెంకటేశ్వర్లు, రాజబోయిన నాగేశ్వరరావు, రమిశెట్టి సరళ, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ బోజ్య నాయక్, సారేపల్లి శేఖర్, బానోతు రాముడు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, మండల వ్యవసాయశాఖధికారి నవీన్ బాబు, సొసైటీ సీఈఓ లంక నరసింహారావు, ఏఈఓలు విజయ్, శ్రీ కన్య, సాయిభాను, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: