మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండలపరిదిలోని అనంతారం, కరకగూడెం,బట్టుపల్లి గ్రామాలలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు,కరకగూడెం(చిరుమళ్ళ)ఆశ్రమ పాఠశాల, బట్టుపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల లో పదవతరగతి చదువుతున్న 90 మంది పదవతరగతి విద్యార్థిని,విద్యార్థులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల వివేకవర్ధిని డిగ్రీ కళాశాల,ఒకేషనల్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కటకం వెంకటేశ్వర్లు,ప్రిన్సిపాల్ కటకం వరలక్ష్మీ విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్లు,పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచి పవర్థనతో ఉంటు మంచి మార్కులు సాధించి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెవలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ పోలెబోయిన సర్వేశ్వరావు,చిరుమళ్ళ ప్రధానోపాధ్యాయులు జగన్,పిఈటి వట్టం.సంపత్ కుమార్,ఉపాద్యాయులు, కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ యుత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: