మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో ఆదివాసీ యువ నాయకులు అరేం ప్రశాంత్, కాకా శివశంకర్ ప్రసాద్, వాడే వీరాస్వామిలకు పెద్దలు కొనకళ్ల శ్రీనువాసరావు, వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో వారి స్వగృహంలో ఘనంగా సత్కరించారు. భద్రాద్రి జిల్లా రాజకీయ పార్టీలకు అతీతంగా సామాజిక సేవ కార్యక్రమాలు, నేటి సమాజంలో యువత సామాజిక సేవ కార్యక్రమాలు చేయ్యడం చాలా చాలా అరుదుగా ఉంటారు తొటి యువ సమాజానికి ఆదర్శంగా భవిషత్తు యువ రాజకీయ నాయకులు ప్రజ సేవ కార్యక్రమాలు చేయ్యలని సమాజం వ్యవస్థ మార్పు కోసం ప్రశ్నిస్తు, ప్రజా సమస్యలు పై నిరంతరం పొరాటం చేస్తూన్న యువ నాయకులను సన్మానించి ప్రోత్సహించడం మా అదృష్టంగా భావిస్తూ మా కుటుంబం సభ్యుల అభినందనలు తేలియజేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకులు కొనకళ్ల నాగభూషణం, కొనకళ్ల రామలింగయ్య, పొట్ట భీమ రాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువ నాయకులు మాట్లాడుతూ సామాజిక ద్రుక్పదం కలిగి మానవత్వంతో చేయు సేవలను గుర్తించి సన్మానించి ప్రోత్స హిస్తున్నటువంటి కొనకళ్ల శ్రీనువాసరావు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తేలియజేసారు. పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ రాబోయే రోజుల్లో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయ ఎదుగుదలకు ప్రయత్నం చేస్తు ముందుకు సాగుతాం నేటి యువత అందురు చదువుతో పాటు సంస్కారం, సామాజిక సేవ కార్యక్రమాలు, ప్రశ్నేంచే తత్త్వంతో కూడిన విలువలు పాటిస్తూ రాజకీయాల్లోకి వస్తేనే దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తాయని వారు తెలిపారు.
Navigation
Post A Comment: