మన్యం టివి దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం లోని చిన్న సన్నకారు రైతులు పండ్లతోటల పెంపకానికి తగిన ప్రోత్సాహం కోసం దరఖాస్తులు చేసుకోవాలని దుమ్ముగూడెం ఎంపీడీవో చంద్రమౌళి ఒక ప్రకటనలో తెలిపారు. 2022 సంవత్సరానికిగానూ రైతుల భూముల్లో బోరు ఉండి పండ్ల తోటల పెంపకం పై ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని, జామ మామిడి నిమ్మ తదితర పండ్ల తోటలు పెంచుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. ఒక రైతు ఐదు ఎకరాల వరకు మాత్రమే పండించుకొనుటకు అవకాశం ఉంటుందని, మూడు సంవత్సరాల పాటు ఆ పండ్ల తోటలు మొక్క కొనుగోలు, గుంట తీసినందుకు, మొక్క నాటి కర్ర కట్టేందుకు ఉపాధి హామీ పథకం వర్తిస్తుందని, ఆసక్తిగల రైతులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి ని సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీవో చంద్రమౌళి తెలియచేశారు..
Post A Comment: