గుండాల మే 16(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం మండలం లో పర్యటించి 75లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసిన 15 సిసి రోడ్లను ప్రారంభించారు. మండల కేంద్రంలో 6, జగ్గయ్య 2,వేపల గడ్డ, జామ గూడెం, గలబ, లక్ష్మీపురం, కన్నాయిగూడెం, కోనేరు గూడెం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున పూర్తయిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకేసారి పెద్ద ఎత్తున సిసి రోడ్లకు నిధులు కేటాయించి త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందన్నారు. మిగిలిన రోడ్లకు నిధులు తెచ్చి పూర్తి చేస్తామన్నారు. ఎన్నడూ లేనివిధంగా గుండాల మండలానికి కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్ పి టి సి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, తాసిల్దార్ కిషోర్, ఎంపీడీవో హజరత్ వలి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య,సర్పంచ్ సీతారాములు, లింగ గూడెం సర్పంచ్ నరసింహారావు, ఎంపీటీసీ సంధాని, రోళ్ల గడ్డ ఎంపీటీసీ రాజేశ్వరి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, గడ్డం రమేష్ , నీట్ట రాములు, అబ్దుల్ నబీ, సుధాకర్, సుతారి సత్యం, తాటి కృష్ణ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: