CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి. -తెరాస పార్టీ మండల సెక్రెటరీ జుజ్జూరు వెంకన్న బాబు.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాలతో అశ్వారావుపేట శాసనసభ్యులు మేచ్చా నాగేశ్వరరావు పిలుపు మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని తెరాస పార్టీ మండల సెక్రటరీ జుజ్జురి వెంకన్నబాబు తన స్వగృహంలో నల్లజెండా ఎగురవేస్తూ మోదీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసన తెలియచేసారు. దానిలో భాగంగా తిరుమలకుంట గ్రామంలో ప్రతి రైతు ఇంటి పైన అలాగే తెరాస పార్టి ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఇంటి పైన నల్ల జెండా ఎగురవేసి, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన ర్యాలీ నిర్వహించి, స్థానిక సెంటర్లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేసారు. ఈ సందర్బంగా తెరాస పార్టీ మండల సెక్రటరీ జుజ్జురి వెంకన్నబాబు మాట్లాడుతూ పంజాబ్‌ మాదిరిగా తెలంగాణలోనూ ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి పంటలు కొనుగోలు చేయకుండా కాలక్షేపం చేస్తున్నదని విమర్శించారు. రైతులను మోసం చేసిన రాజ్యాన్ని కూల్చేదాకా వెనుకడుగు వేసేదే లేదన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లుకొండ చెన్నారావు, తెరాస పార్టీ మండల సెక్రెటరీ జుజ్జూరు వెంకన్న బాబు, మాజీ సర్పంచ్ సున్నం రామ లక్ష్మయ్య, ఉప సర్పంచ్ జుజ్జురి రాంబాబు, టిఆర్ఎస్ నాయకులు పల్లెల రామ లక్ష్మయ్య, పానుగంటి లక్ష్మణ్ రావు, మడకం ముత్యాలరావు, కోర్స చెన్నారావు, అల్లం చంద్రం, డాబా జగ్గయ్య, సిరిబత్తుల సాంబయ్య మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: