మన్యం టివి దుమ్ముగూడెం::
కేంద్ర ప్రభుత్వంతెలంగాణ రైతుల యొక్కధాన్యం కొనాలని కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా టి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ,కేటీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షుడు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా గంగోలు గ్రామంలో ప్రధాన రహదారిపై నల్ల జెండాలతో నిరసన తెలియజేసిన మండల రైతు బంధు సమితి అధ్యక్షులుబత్తుల శోభన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ
మోడీ ప్రభుత్వంతెలంగాణ అభివృద్ధినిచూసి ఓర్వలేకముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రమించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొలాలకు నీటి సౌకర్యం కల్పించి ఎన్నో సంక్షేమ పథకాలు రైతులకు అందించి వ్యవసాయం రైతులు ధైర్యంగా చేస్తుంటే ఈ రోజున పండించిన ధాన్యం కొనకుండా తెలంగాణ రైతాంగాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని మోడీ ప్రభుత్వం మొండి వైఖరి విడి
రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ చేశారు
లేకపోతే తెలంగాణ రైతన్న ఉసురు తగిలి మోడీ ప్రభుత్వం పతనం అవ్వక తప్పదని రైతులు తెలంగాణలో బీజేపీ ని బొంద పెట్టడంఖాయమని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో గంగోలు సర్పంచ్ మడకం చంద్రశేఖర్,ఉప సర్పంచ్ అప్పారావు,రైతు బంధు సమితి కమిటీ సభ్యులుబత్తుల గాంధీ,రైతులుగుబ్బల సుబ్రహ్మణ్యం,కుసిని శేఖర్, జగిడి నాగరాజు రైతులు పాల్గొన్నారు
Post A Comment: