గుండాల ఏప్రిల్ 5(మన్యం మనుగడ) జార్జిరెడ్డి ఆశయసాధనలో నడుద్దామని పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులు ఇర్ప రాజేష్ అన్నారు. మంగళవారం జార్జిరెడ్డి 50 వ వర్ధంతి సభను కస్తూరిబా పాఠశాల లో నిర్వహించారు. జార్జిరెడ్డి విద్యార్థుల సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని ఆయన అన్నారు. విద్యార్థులను చైతన్య పరుస్తూ ఉద్యమాలను ఉధృతం చేసే వారని ఆయన అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి జార్జి రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థుల సమస్యల కోసం ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు
Post A Comment: