మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల చల్పాక గ్రామపంచాయతీ చల్పక కొత్తూరు కు చెందిన చింత చిలకమ్మా 32 సంవత్సరాలు పాము కాటుకు గురై మృతి చెందారు. వివరాల్లోకి వెళితే గ్రామంలో ఉపాధి లేక బయట గ్రామానికి మిరపకాయలు చేయడానికి వెళ్లగా అక్కడ పాము కాటేసింది. వెంటనే హనుమకొండ హాస్పటల్ కు తీసుకెళ్లడం జరిగింది.2 వారాల క్రితమే పాముకాటుకు గురి కాగా చికిత్స పొందుతూ.. మంగళవారం ఉదయం 5 గంటలకు మరణించిందని,భర్త సమ్మయ్య వ్యవసాయ కూలి కాగా ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.ఒక ఆడపిల్ల అంజలి 12 సంవత్సరాలు ఏడో తరగతి చదువుతోంది.పెద్ద కొడుకు అఖిల్ పది సంవత్సరాలు, చిన్న కొడుకు ఆరు సంవత్సరాల పిల్లలు ఉన్నారు.ఇంత చిన్న పిల్లలు ఉన్న చిలకమ్మా మృతి చెందడం చాలా బాధాకరమని, వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని,చిలకమ్మ మృతితో చాల్పక గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Post A Comment: