మన్యం మనుగడ , పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గొట్టెళ్ళ గ్రామ సమీపంలో విద్యుత్ షాక్ తో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో 8 పాడి గేదెలు మృతి చెందాయి.11 కెవి విద్యుత్ తీగలు తెగి పడడంతో అటుగా వెళ్తున్న గేదలు విద్యుత్ తీగ కు తగలడంతో, అప్పటికప్పుడే మృతి చెందాయి. మృతి చెందిన గేదెలు గొట్టెళ్ల గ్రామానికి చెందిన కొమరం లక్ష్మయ్య - రెండు ,కొమరం పరమయ్య -రెండు,వజ్జా బక్కయ్య -రెండు,వజ్జా రాంబాబు కు చెందినవి గా గుర్తించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, సంఘటనకు గల విషయాన్ని తెలుసుకొని, పాడి గేదెల యజమానులకు గేదెలకు సంబంధించిన బీమా అందే విధంగా, సత్వర న్యాయం చేయాలని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. సంబంధిత అధికారులను పిలిపించి పంచనామా నిర్వహించారు. పాడి గేదెలు మరణించడంతో రైతుల బాధ వర్ణనాతీతంగా మారింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Post A Comment: