- పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్లు సమాచారం
మన్యం డెస్క్,:-ఇల్లందు బస్టాండ్ ప్రాంగణములో మద్యం మత్తులో ఉన్న మహిళపై అత్యాచార యత్నం చేస్తున్న ఇద్దరు నిందితులు ఇల్లందు పోలీస్ అదుపులో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే ఇల్లందు బస్ స్టాండ్ ప్రాంగణములో మద్యం సేవించి నిద్రిస్తున్న మద్యం సేవించిన ఇద్దరు యువకులు ఆమెను ఎత్తుకెళ్లి నూతనంగా నిర్మిస్తున్న మినీ బస్ డిపో ప్రహరీ గోడ వద్ద అత్యాచార యత్నం చేస్తుండగా బస్టాండ్ ఆవరణలో ఉన్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం. మద్యం మత్తులో ఉన్న యువకులు అత్యాచారయత్నం చేస్తున్నప్పటికీ మద్యం ఎక్కువగా సేవించడం వలన ఏమి జరుగుతుందో కూడా ఆమెకు తెలియడం లేదని ప్రయాణికులు పేర్కొన్నారు
Post A Comment: