CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి

Share it:

 


మన్యం మనుగడ, పినపాక :


తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఏడూళ్లబయ్యారం గ్రామ కమిటీ అధ్యక్షులు బూర రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావాలనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కేవలం రాజకీయంగా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొలేక బీజేపీ ప్రభుత్వం రైతులను నష్టపరుస్తుందన్నారు. రైతులకు అనుకూలంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వనరులు ఏర్పాటు చేసి ధాన్యం పండించేలా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేయలేని దీన స్దితిలో ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, రైతుబంథుసమితి మండల అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సొసైటీ వైస్‌ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, డైరెక్టర్‌ కొండేరు రాము,కటకం గణేష్‌, సర్పంచ్‌ కోరం రజిని, నాయకులు ముక్కు వెంకటేశ్వరరెడ్డి, నాసర్‌ రెడ్డి, ఎస్‌కే జాంగీర్‌, మీరా సాహెబ్‌, వెన్నా కాశిరెడ్డి, గోళ్ల వెంకటనారాయణ, పిళ్లారాయుడు, కొర్సా రమణ, కొర్సా చిన సారమ్మ, మందటి దానమయ్య, కంది సుధాకర్‌, యక్కంటి అంకిరెడ్డి, పి.మల్లయ్య, గుండు రమేష్‌, పాపాల వీరబాబు, పోతునూరి సంతోష్‌, సిహెచ్ శ్రీను, సాంబశివరావు, తునికి రామారావు, గుండ్ల రమేష్‌, ఎస్‌.అశోక్‌, మారయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: