మన్యంమనుగడ, మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో శనివారం రాత్రి 33/11కె.వి సబ్ స్టేషన్ నుంచి అధిక వోల్టేజ్ తో కరెంట్ ప్రసారం కావటం తో వినియోగదారుల ఇళ్లలో,వ్యాపారులకు సంబంధించిన ఫ్రీజ్ లు,ఓవెన్ లు, ఏ. సి,రిఫ్రిజిరేటర్లు,ఫ్యాన్లు,కూలర్లు, ఇతర విద్యుత్ పరికరాలు కాలిపోయాయి.మండల కేంద్రం లోని దుర్గ బేకరీ షాప్ ల్లో ఉన్న ఫ్రిజర్ లు,ఓవెన్లు, కిరణముషాప్ లో ఇన్వెటర్, రిఫ్రిజిరేటర్లు ఇతర షాపుల్లో ఫ్యాన్ లు , ఇళ్లల్లో బుగ్గలు కాలిపోయాయి సుమారు రూ,6 నుంచి రూ7 లక్షలో భారీ నష్టం జరిగింది .
దీని విషయం పై కెరెంట్ అధికారులను అడిగితే ట్రాన్సర్మ్ ర్ లో సాంకేతిక లోపం ఏర్పడిందని, పై అధికారులకు మేము ఎప్పటి నుంచి చెపుతున్నాం పట్టించు కోవడం లేదని సబ్ స్టేషన్ నిర్వహణ సిబ్బంది చెపుతున్నారని షాప్ ఓనర్స్ పలువురు చెపుతున్నారు.ఇకనైనా సబ్ స్టేషన్ లో సాంకేతిక పరమైన వైరుధ్యాలను లోపాలను సవరించి నాణ్యమైన కరెంట్ సరఫరాను చేయాలని మంగపేట మండల కేంద్రంలో ని పలువురు వినియోగదారులు,వ్యాపారులు కోరుతున్నారు.
Post A Comment: