మన్యం మనుగడ, మంగపేట.
సబ్సిడీపై పరదాలను పంపిణీ చేస్తున్నామని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పాత్రికేయుల తో మాట్లాడుతూ మంగపేట మండల కేంద్రంలోని రైతు సేవ సహకార సంఘం కార్యాలయంలో పరదాల పంపిణీ ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని, కావలసిన రైతులు పట్టాదార్ పాస్ బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ లను అందజేసి మంగపేట రైతు సేవా సహకార సంఘం నుండి పొందవచ్చునని తెలిపారు. 30 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పు కలిగిన త్రీడీ టెక్నాలజీ శిల్పాలిన్ పరధాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు సహకార సంఘం కార్యాలయం లేదా సీఈవో జగన్నాధ రావు ని సంప్రదించాలని కోరారు.
Post A Comment: