గుండాల ఏప్రిల్ 16(మన్యం మనుగడ) విద్యుత్ ఘాతంతో మూగజీవాలు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని దామర తోగు గ్రామానికి చెందిన రైతు కల్తీ సమ్మయ్య కు చెందిన ఒక ఆవు, రెండు మేకలు, ఒక కుక్క మృతి చెందాయి. గుండాల నుండి దామర తో వెళ్లే 11 కెవి విద్యుత్తు తీగ తెగి పడడంతో మూగజీవాలు మృతి చెందాయి. మొత్తం ఒకే రైతు కు చెందినది కావడంతో రైతు మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రమాదం సంఘటన తెలుసుకున్న వెటర్నరీ అసిస్టెంట్ హరికిరణ్, విద్యుత్ శాఖ లైన్మెన్ రంజిత్ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుతారి సత్యం తదితరులు పాల్గొన్నారు
Post A Comment: