దమ్మపేట ఏప్రిల్ 12 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలం లోని అత్యంత మారుమూల అటవి ప్రాంతం పూసుకుంట గ్రామం లో ఈరోజు గవర్నర్ పర్యటించారు సమావేశం తరువాత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్య రాజన్ గారినీ కలిసి,అశ్వారావుపేట నియోజిక వర్గంలో ఆదివాసీ ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు,ప్రధానంగా ఆదివాసీలు సాగుచేసుకునే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, జీవో నెంబర్ మూడును కాపాడాలని కొండరెడ్ల అభివృద్ధికి ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు కేటాయించాలని వినతి పత్రం ఇచ్చిన దమ్మపేట మండల జె.ఎ.సి నాయకులు ఇందుకు గవర్నర్ స్పందిస్తూ తప్పకుండా కేంద్రం దృష్టికి ఈ సమస్య ను తీసుకువెళతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ,రాష్ట్ర జేఏసీ కార్యదర్శి కొరసావెంకటేష్ దొర మండల జెఎసి అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ ,కుంజా చినబాబు వంకా వరాలబాబు వాడే వీరస్వామి కాకా శివ శంకర్ ప్రసాద్ సోయం వీరభద్రం,కారం శ్రీరాములు,సోయం రామూర్తి, పార్శిక మారేష్, కొమరం ప్రసాద్,,మడకం ప్రసాద్, తాటి ప్రసాద్,తధితరులు పాల్గొన్నారు.
Post A Comment: