CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సాటి మనిషికి సాయ పడటం లోనే దైవత్వం ఉంది... నిస్వార్ధ సేవకులను సన్మానించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

Share it:

 


మదర్ తెరిసా చెప్పిన విధంగా సాటి మనిషికి సాయం చేయడం లోనే దైవత్వం ఉందని,అందుకే దైవం మనుష్య రూపేణా అని నిరూపిస్తున్న ప్రతి ఒక్కరూ గొప్పవారే అని జేడీ ఫౌండేషన్ చైర్మన్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు, ఈ మేరకు భద్రాచలం పర్యటన లో భాగంగా నిస్వార్థంగా ఏమి ఆశించకుండా పేద ప్రజలకు వైద్య సదుపాయాలు, అన్నదానం, వివాహాలు జరిపిస్తూ సేవలు చేస్తున్న భద్రాచలం పట్టణం కి చెందిన ఎం.డి సర్వర్ మియా, ఎం.డి అసద్, ముస్లిం మైనారిటీ సంక్షేమ సమితి మండల అధ్యక్షుడు ఎస్.కె. మస్తాన్ లతో పాటు తనకు ఉన్న దానిలో కొంత నిరుపేద ప్రజల అవసరాలు తీరుస్తున్న చిరు ఉద్యోగి శ్రీనివాస్ రావు దంపతులను జేడీ లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత లు తాము అభిమానించే శ్రీ జేడీ లక్ష్మీనారాయణ ని కలవడం సంతోషం గా ఉందని అటువంటి నిజాయితీ పరుల చేత గౌరవించబడటం ఆనందంగా ఉందని తెలిపారు.. ఈ కార్యక్రమం ఉద్దేశించి జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మురళీమోహన్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సమాజంలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న మానవతా మూర్తులను కూడా ఫౌండేషన్ ద్వారా సన్మానిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కంభంపాటి సురేష్ కుమార్ తో పాటు జెడి ఫౌండేషన్ సభ్యులు హన్సి,పవన్ కుమార్, కడాలినాగరాజు,యూసుఫ్ మియా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: