మన్యం మనుగడ, అశ్వారావుపేట:భారత దేశ సామాజిక ఉద్యమ చరిత్రలో మరుపురాని మహనీయుడు అంతే గాకుండా ఆయన మహిళలు, అట్టడుగు వర్గాల వారికి విద్య, కనీస అవసరాలు కోసం పోరాడిన ధీరుడు అని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.పుల్లయ్య అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సోమవారం అశ్వారావుపేట మూడు రోడ్ల కూడలిలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పట్ల పూలే అచంచలమైన ప్రేమ కనబరిచారు అని, ఆర్థిక సామాజిక అసమానతలు పై అలుపెరుగని తిరుగుబాటు చేశారని, సమాజానికి చదువు ప్రాధాన్యతను ఆచరణలో చూపిన సామాజిక విప్లవ స్పూర్తి శిఖరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్, సిపిఐ(ఎం) మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, హమాలి నాయకులు ఏసు, నాగేంద్ర, రాంబాబు, ఖాసిం,రవి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: