మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు,సంఘ సంస్కర్త ,భారత దేశ తొలి ఉపప్రధానిగా విశేష సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముత్తినేని సుజాత, వైస్ ఎంపీపీ కంచు గట్ల వీరభద్రం,అధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలామాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వరప్రసాద్,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరిపుద్దీన్,ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు కమటం నరేష్, ఏ పీ ఎం సత్యనారాయణ,పంచాయితీ కార్యదర్శులు,కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: