మన్యం మనుగడ ప్రతినిధి:
ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామం వద్ద నాగపూర్ నుండి అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వే చేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు, రైతులకు తెలియకుండా సర్వే చేయడం ఏమిటని సర్వే ఎలా చేస్తారని మాకు తెలియకుండా మా చేలోకి ఎలా వస్తారని నిలదీసి అడిగారు సర్వే చేయడానికి వీలు లేదని తేల్చిచెప్పి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైతుసంఘం అధ్యక్షులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, రైతుబాధితుల సంఘం అధ్యక్షులు తక్కెళ్ళపాడు భద్రయ్య, వేములపల్లి సుధీరు, మంగళ గూడెం సర్పంచ్ ఎంపీటీసీ విరెల్లి ప్రసాదు, బోజెడ్ల వెంకటయ్య, కందుల రామయ్య, ఉపేందర్, ప్రతాప నేని శ్రీధర్, నాదెండ్ల పుల్లయ్య రైతులు పాల్గొన్నారు.
Post A Comment: