మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట సెక్టార్ పరిధిలోగల అంగన్వాడీలకు పోషన్ పక్వాడ్ కార్యక్రమము సూపర్వైజర్ రాణి ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా జానంపేట లోని రైతు వేదికలో సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసం కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రాణి మాట్లాడుతూ, తల్లులు, పిల్లలు సరైన పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని,ప్రభుత్వ సేవలను ప్రతి ఒక్క తల్లి వినియోగించుకోవాలని కోరారు.ఆకుకూరలలో సరైన పౌష్టికాహారం ఉంటుందని, ప్రతి ఒక తల్లి ఆకుకూరలు తిని ఆరోగ్యంగా ఉండాలని, పుట్టబోయే బిడ్డకు మంచి పౌష్టికాహారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో జానంపేట సర్పంచ్ బాడిస మహేష్, ఎంపీటీసీ హరీష్,వివిధ అంగన్వాడీ కేంద్రాలకు చెందిన అంగన్వాడీ సిబ్బంది, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు
Post A Comment: