CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎల్చి రెడ్డిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ .పలు రికార్డులను పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా

Share it:

 



  • పాఠశాల సిబ్బంది పనితీరు పై అసంతృప్తి
  • పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో మాటామంతీ

మన్యం మనుగడ, పినపాక:

ఎల్చిరెడ్డిపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పాఠశాలలో మెనూ పాటించడంలేదని, చారు భోజనం పెడుతున్నారని, విద్యార్థులు తెలపడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోని పలు రికార్డులను తనిఖీ చేశారు.

 విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి కాసేపు ఆప్యాయంగా గడిపారు, అలాగే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గురుకులాలు, కస్తూరిబాయ్ ఆదర్శ, సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేసిందన్నారు, గ్రామీణులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

 పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చదువుకోడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: