గుండాల ఏప్రిల్ 16(మన్యం మనుగడ) గుండాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు ఆరు కాన్పులు చేసిన గుండాల వైద్య సిబ్బంది. ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దటం తో ఆస్పత్రిలో కాన్పుల సంఖ్య భారీగా పెరిగిందని ప్రాథమిక వైద్యశాల వైద్యుడు రవిచంద్ అన్నారు. ఆసుపత్రిలో కాన్పు అయిన వారందరికీ కెసిఆర్ కిట్ అందించామని ఆయన పేర్కొన్నారు. అనంతరం గుండాల ఎంపీటీసీ సంధాని మాట్లాడుతూ ఒకేరోజు వైద్య సిబ్బంది ఆరు కాన్పులు చేయడం అభినందనీయమని అన్నారు. వైద్య సిబ్బంది తో పాటు 108 సిబ్బందిని కూడా ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సేవలు అందుతున్నాయని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు
Post A Comment: