- భావితరలకు బాబా సాహెబ్ ఆదర్శం : జిల్లా అధ్యక్షులు యం.ఏ.రజాక్.
కొత్తగూడెం : భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహలే సున్నత్ జమాత్ జిల్లా కార్యాలయం లో బాబా సాహెబ్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు యం.ఏ.రజాక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు యంఏ.రజాక్ అధ్యక్షతన అహలే సున్నత్ జమాత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభ్యులందరూ కొత్తగూడెం పోస్ట్ఆఫీస్ సెంటర్ లోగల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో అహలే సున్నత్ జమాత్ జిల్లా అధ్యక్షులు యంఏ.రజాక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భావి తరలకు ఆదర్శప్రాయుడని నేటి యువత బాబా సాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. నేడు దేశంలో నేలకోని ఉన్న అనిశ్చితి పోవాలి అంటే జై భీమ్ - జై మీమ్ ఒక్కటే మార్గం అని తెలిపారు. దేశం లో అనగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పోరాటాలు చేసిన మహనీయుడు అంబేద్కర్ అని బాబా సాహెబ్ ఈ దేశానికి చేసిన సేవలను రజాక్ గుర్తు చేశారు. స్వాతంత్య్రం అనంతరం బాబా సాహెబ్ ను పార్లమెంటు కు పోకుండా ఎన్ని శక్తులు అడ్డుకున్న ఆయన్ను కలకత్తా నుండి పార్లమెంటు కు పంపిన ఘనత నాటి ముస్లింలీగ్ పార్టీదేనని రజాక్ తెలియ చేశారు. బాబా సాహెబ్ ఆశయ సాధనకు దేశ ప్రజలందరు పాటుపడాలని రజాక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అహలే సున్నత్ జమాత్ జిల్లా ఉపాధ్యక్షులు అమీర్ ఖాద్రీ సాహెబ్, ప్రధాన కార్యదర్శి షేక్ యఖుబ్, కోశాధికారి మహ్మద్ యఖుబ్ ఉద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ యండి యుసుఫ్, ఉర్దూ ఘర్ చైర్మన్ షేక్ అన్వర్ పాష, సంయుక్త కార్యదర్శి మహ్మద్ గౌస్ ఉద్దీన్, రైల్వే మహ్మద్ ఇస్మాయిల్, అలీం ఉద్దీన్, మహబుబ్ ఖాద్రీ, యుసుఫ్ ఖాద్రీ, రామవరం భాథ్యులు మహ్మద్ షమీ, యువజన నాయకులు మహ్మద్ అస్లాం, షోయబ్ సాబ్రీ, రామంజనేయ కాలనీ షకిల్, నీస్సార్ అహ్మద్, బాబు జాని, డాక్టర్ ఖాన్, అహలే సున్నత్ జమాత్ జిల్లా అథికార ప్రతినిధి అడ్వకేట్ మహ్మద్ సాదిక్ పాషా, యం.ఏ. రహమాన్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: