మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మన ఊరు మన బడి" కార్యక్రమంలో మొదటి దశ పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన పాఠశాలల పనులను బుధవారం జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఎంపికైన 17 పాఠశాలల మౌలిక వసతులను గుర్తించి మూడు దశలలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మొదటి దశలో ఎంపికైన పాఠశాలలో హాజరు శాతం ఎక్కువగా ఉన్న పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, సర్పంచ్ రమాదేవి, ఎంపీటీసీ సతీష్ కుమార్, ఎం ఈ ఓ వెంకట్, ఎం పి ఓ రామారావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు నరసింహారావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు వీరభద్రం, యువజన నాయకులు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు వేల్పుల నరసింహారావు, రామిశెట్టి రాంబాబు, రోకటి సురేష్, రామిశెట్టి నాగేశ్వరరావు, రాచబంటి వెంకటర్సయ్య, లింగారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: