మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో "కాట సుప్రియ" నిర్వహిస్తునటువంటి "విలేజ్ విపంచి" యూట్యూబ్ చానెల్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మజ్జిగ సప్లై కేంద్రoను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంగపేట ఏఎస్ఐ సూరయ్య,ప్రత్యేక ఆహ్వానితులుగా" బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి" తాటి కృష్ణ హాజరై రిబ్బన్ కటింగ్ చేసి ఉచిత మజ్జిగ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భుచ్చంపేట మాజీసర్పంచ్, "ఆత్మ" చైర్మన్ పగిడిపెళ్లి వేంకటేశ్వర్లు బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్ పాషా, సీపీఎం మండల కన్వీనర్ ఎల్.పి. ముత్యాలు, బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు దంతేనపెళ్లి నరేందర్, బీ. ఎస్. పి నాయకులు ఎంపెళ్లి వీరస్వామి, బీజేపీ మండల అధికార ప్రతినిధి దూళిపాల విజయ్ కుమార్, దికొండ కాంతారావు, బసరకాని హరికృష్ణ, చెట్టుపెళ్లి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: