ఖమ్మం ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు పిట్టల వెంకట నర్సయ్య ను హైదరాబాద్ నగరంలో జరిగిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు . అదే విధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా దొంతు జ్వాల నరసింహారావు ను , ప్రధానకార్యదర్శి గా బండారు నరేష్ ను నియమించారు . ఈ నియామక పత్రాలను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటన్ నరసింహ యాదవ్ , మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ రావు , జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మరియు తదితరులు అందజేశారు . అనంతరం ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్టల వెంకట నర్సయ్య మాట్లాడుతూ బీసీ కుల సంఘాల అభ్యున్నతకు శక్తి వంచన లేకుండా , తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరింత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు . తమపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినా వారికి పేరుపేరునా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు .
Post A Comment: