గుండాల /ఆళ్లపల్లి ఏప్రిల్ 11(మన్యం మనుగడ) సీఎం సహాయనిధి నిరుపేదల పాలిట వరంగా మారిందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. సోమవారం మండలం పరిధిలోని రాయపాడు గ్రామానికి చెందిన పెండ కట్ల లక్ష్మణ స్వామికి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంజూరు చేయించిన 36 వేల రూపాయల చెక్కును ఆయనకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటివరకు పెద్ద మొత్తంలో రేగా సీఎం సహాయనిధి నుండి చెక్కుల ను మంజూరు చేయించారు అన్నారు. అనారోగ్యానికి వేల రూపాయలు వెచ్చించి ఇబ్బంది పడుతున్న వారికి ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుభార్గవి, ప్రధాన కార్యదర్శి బాబా, పార్టీ నాయకులు కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: