CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏప్రిల్ 14న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే కామ్రేడ్ జార్జిరెడ్డి 50వ వర్ధంతి సభను జయప్రదం చేయండి.

Share it:

 


  • పీ.డీ.ఎస్.యు. ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు క్రాంతి మస్తాన్.

ఖమ్మం : పీ.డీ.ఎస్.యు వ్యవస్థాపకుడు , ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి 50వ వర్థంతి సభ ఏప్రిల్ 14న ఉస్మానియా యూనివర్సిటీలో పీ.డీ.ఎస్.యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని , ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు . కామ్రేడ్ జార్జి రెడ్డి 1972లో ఉస్మానియా యూనివర్సిటీ లో ఉన్న అగ్రకుల పెత్తందారీ అరాచక శక్తులకు వ్యతిరేకంగా ఉస్మానియ యూనివర్సిటీలో పేద , బడుగు , బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన పోరాడారు . ఆనాడు క్యాంపస్ లో ఉన్న మతోన్మాద అరాచక శక్తులు అమ్మాయిలను కూడా హింసించే వారని , లైంగికంగా వేధించే వారిని , ఈ అరాచక శక్తులకు వ్యతిరేకంగా విద్యార్థులను కూడాగట్టి పోరాటం చేసి అతి తక్కువ కాలంలోనే విద్యార్థులకు నాయకుడిగా ఎదిగారని , కామ్రేడ్ జార్జ్ రెడ్డి న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్మెడల్ లిస్ట్ , కిక్ బాక్సింగ్ లో ఛాంపియన్ , కామ్రేడ్ జార్జి రెడ్డి అశేషమైన పీడిత విద్యార్థుల ఆదరణ పొంది క్యాంపస్ లో జరుగుతున్న విద్యార్థి సంఘ ఎన్నికల్లో జార్జ్ అనుచరులు గెలుపొందారు . కామ్రేడ్ జార్జి రెడ్డి యూనివర్సిటీలో ఉంటే తమ అరాచకాలు సాగవని గ్రహించిన మతోన్మాదులు ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్నికల్లో ప్రచారం చేసి వస్తున్నా జార్జ్ రెడ్డి కత్తులతో నరికి ఏప్రిల్ 14 1972 న అతి కిరాతకంగా చంపారు . కామ్రేడ్ జార్జి రెడ్డి అందరికీ ఉచితమైన నాణ్యమైన విద్యను అందించాలని పోరాడారు . కుల మత దోపిడి అణచివేత లేని సమాజాన్ని సమ సమాజాన్ని కలలుకన్నాడు .  

నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జార్జిరెడ్డి ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. విద్యను మరింత కార్పొరేటీకరణ , కాషాయీకరణ చేస్తూ పేద విద్యార్థులకు విద్యకు దూరం చేస్తున్నాయి . విద్యారంగంలో అశాస్త్రీయమైన భావజాలం నింపుతూ మూఢనమ్మకాలు పెంపొందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది . కెసిఆర్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకొచ్చి ఉన్నత విద్యా రంగాన్ని కార్పొరేటర్ కు తాకట్టు పెట్టింది . ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది . లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పిఆర్సి నివేదికలో బిశ్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది . కానీ 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం నిరుద్యోగులను మరోసారి మోసం చేయడమే . ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని అని నూతన ఉద్యోగాలను కల్పించాలని , నిరుద్యోగ సమస్యతో చనిపోయిన విద్యార్థులకు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు ఖమ్మం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు క్రాంతి మస్తాన్ నాయకులు ఉపేందర్ , లక్ష్మీనారాయణ , పౌరహక్కుల నాయకులు షరీఫ్ , రవి, ఖాదర తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: