ములకలపల్లి:మార్చి15:(మన్యం మనుగడ)ప్రతినిధి:న్యూస్:
అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర మంత్రి
తలసాని శ్రీనివాస్ యాదవ్ ని వ్యక్తిగతంగా కించపరుస్తూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ములకలపల్లి టిఆర్ ఎస్ వి మండల అధ్యక్షుడు గుంట్రు కృష్ణా యాదవ్, తీవ్రంగా ఖండించారు.బలహీన వర్గాలకు చెందిన మంత్రిని కించపరిచిన రాజగోపాల్ రెడ్డి కి భవిష్యత్తు లో BC లందరూ గుణపాఠం చెబుతారని, ఆంధ్రాపాలకుల హయాంలో కూడబెట్టిన అక్రమ ఆస్తులతో కళ్ళు నెత్తికి ఎక్కయన్నారు.తక్షణమే తలసాని శ్రీనివాస్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో పొన్నూరు హరి,పాలగాని రవి,రామకృష్ణ,సత్య ప్రకాష్,రామ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: