మన్యం టివి దుమ్ముగూడెం::
మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాలలో శ్రీసీతారామచంద్రస్వామి వారి వసంతోత్సవం ,డోలోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హోలీ పౌర్ణమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమంలో తీర్థ బిందె లో పవిత్ర గోదావరి నది జలాలతో అంకురార్పణ చేసి స్వామివారి కల్యాణం కు ఏర్పాట్లు చేస్తారు. ఇందులో భాగంగా గా స్వామి వారి కల్యాణ ఏర్పాట్లకు పసుపు కొట్టి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు తయారీకి శ్రీకారం చేస్తారు. హోలీ పౌర్ణమి సందర్భంగా స్వామివారిని పెళ్ళికొడుకుని చేసే శుభ ముహూర్తం. పర్ణశాల వచ్చిన భక్తులు స్వామివారి కల్యాణాన్ని సంబంధించిన పసుపు దంచే కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు కిరణ్ కుమార్ చార్యులు, భార్గవ చార్యులు ,నరసింహాచార్యులు, ఆలయం ఇంచార్జి ప్రసాద్ ,ఆలయ సిబ్బంది శివ, రాము గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: