CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన సీసీ రోడ్ కు శంకుస్థాపన చేసిన ఎంపీపీ.

Share it:


 మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామ పంచాయతీ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను శంకుస్థాపన చేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు ఆదేశాల మేరకు సుమారు 7 లక్షలు వ్యయంతో ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీ రోడ్లను నిర్మించనున్నారని తెలిపారు. అలాగే ఎన్ఆర్జీఎస్ వర్కులలో మొత్తం మండలంలో 1.25 లక్షలు వ్యయంతో 17 పంచాయతీలలో 19 సీసీ రోడ్లను ఎమ్మెల్యే మెచ్చా చొరవతో నిర్మించనున్నారని ఈ సంధర్బంగా అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు వేదాంతపురం గ్రామ సర్పంచ్ సోమిని శివశంకర్ ప్రసాద్, ఎంపిటిసి రామకృష్ణ, ఉప సర్పంచ్ శ్రీ కాళహస్తి, మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, వేంకటేశ్వర రావు, వార్డు మెంబర్లు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: