మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో నీటి పొదుపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేసవికాలంలో ఎండల తీవ్రత అధికంగా ఉండడం వలన, నీటిని జాగ్రత్తగా పొదుపు చేయాలని, ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, ఎంపీపీ గుమ్మడి గాంధీ కోరారు.నీటిని అత్యంత విలువైన వనరుగా భావించి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ప్రవర్తించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల అధికారులతో కలిసి జల ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపిఓ శ్రీనివాసరావు, డీ ఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విజయ్ కృష్ణ, వివిధ పంచాయతీ ల సర్పంచులు, సెక్రటరీలు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: