CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వం ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. -అశ్వారావుపేట సీఐ బంధం ఉపేంద్ర రావు.

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చెలనాలు చెల్లింపుపై కల్పించిన భారీ రాయితీ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి, 2&3 వీలర్ వాహనాలపై 75% రాయితీ, 4 వీలర్ & హెవీ వాహనాలపై 50% రాయితీ, ఆర్టీసీ కి 75% రాయితీలు ఉందని ఈ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకోవాలని కోరారు. ఈ చెలాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి వాహనం నంబర్ నమోదు చేస్తే పెండింగ్ జరిమానా వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. వాహదారులు త్వరగా జరిమానాలు చెల్లించి పోలీసు శాఖకు సహకరించాలని, సర్కిల్ ఇన్స్పెక్టర్ బంధం ఉపేంద్ర రావు కోరారు. కోర్టులో లోక్ ఆధాలత్ నడుస్తున్నందున ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులు కోర్టులో హాజరుకాగలరు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వాహనాలు పోలీసు స్టేషన్లో ఉన్నందున అట్టి వాహనదారులు సరిఅయిన ధ్రువపత్రాలు పోలీసుస్టేషన్లో సమర్పించి తమ వాహనాలను తీసుకువెళ్లాలని తెలియజేసారు.

Share it:

TS

Post A Comment: