చండ్రుగొండ మన్యం మనుగడ ప్రతినిధి:నాయీ బ్రాహ్మణులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని నాయీ బ్రాహ్మణ సంగం మండల అధ్యక్షులు కొలిపాక అప్పారావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు ఉషశారదకు డిమాండ్లతో కూడిన వినతిని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ప్రతి నాయీ బ్రాహ్మణుల కి షెడ్లు (దుకాణం) నిర్మించి, ఉచితంగా అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు,రేషన్ కార్డులు అందించాలన్నారు. కులం పేరుతో దూషించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు అప్పారావు, రాచకొండ నాగేశ్వరరావు, కొలిపాక రామారావు, దడిగల శ్రీనివాసరావు, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: