మన్యంటీవీ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల మేజర్ గ్రామ పంచాయితీలోని డబుల్ బెడ్ రూం ఇళ్ళ వద్ద నూతన బోర్ పనులను కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిరు పేదల సంక్షేమం కోసం వారీకి వుండడానికి నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మంచి నీటి అవసరాల కోసం ప్రభుత్వ నిధులతో మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్ళ వద్ద నూతన బోర్ లను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడే కాకుండా మండలంలోని ఇంకా ఐదు గ్రామాలలో వున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ వద్ద కూడ ఈ బోర్ వేపించడం జరుగుతుందని, అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు అశ్వారావుపేట సర్పంచ్ ఆట్టం రమ్య మరియు గ్రామస్తులు పార్టి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: