గుండాల మార్చ్ 5( మన్యం మనుగడ) రాష్ట్రంలోని అర్హులందరికీ రెండు పడకల ఇండ్లు సంక్షేమ పథకాలు అందించాలని ప్రజా పంద నాయకులు ఈసం.శంకర్ అన్న ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ రెండు పడకల ఇల్లు. రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అన్నారు. ఇప్పటివరకు హామీని పూర్తిస్థాయిలో చేయలేక పోవడం వలన చాలామంది అర్హులు ఎదురుచూస్తున్నారని తక్షణమే వాటిని మంజూరు చేయాలన్నారు. 2019లో ఆమోదం తెలిపిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తక్షణమే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల పెన్షన్లను 5 వేలకు పెంచాలని కోరారు. తొలగించిన పెన్షన్లను నీటిని చేర్చి ఆ లబ్ధిదారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని కోరారు. మండల నాయకులు కొమరం శాంతయ్య, ఈసం సింగన్న, రాజు, పీ వై ఎల్ నాయకులు ఈసం కృష్ణ , దుగ్గి సుధాకర్, కోడూరి జగన్, మోకాళ్ళ పాపయ్య , వసీం, పుష్ప రాజు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: