CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రతి నీటి బొట్టు విలువైనదే.భవిష్యత్తు తరాల కోసం నీటిని వృధా చేయకండి.

Share it:

 


  • జల దినోత్సవం లో పాల్గొన్న దుగినేపల్లి ప్రధానోపాధ్యాయుడు హనుమ

మన్యం మనుగడ, పినపాక:


జల దినోత్సవం సందర్భంగా పినపాక మండలం దుగినేపల్లి  జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమ ఆధ్వర్యంలో మంగళవారం  ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఫ్లకార్డుతో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నీటిని విలువైన వనరుగా చూసి నీటిని సంరక్షించాలి అని, వృధా చేయకూడదని నినాదాలు చేశారు. భారతీయ జెండాలు ధరించి సేవ్ వాటర్ అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు హనుమ మాట్లాడుతూ, నీటిని అవసరం ఉన్న మేరకే ఉపయోగిస్తే భవిష్యత్తు తరాలకు కూడా నీరు ఉంటుంది అని అలా కాకుండా అవసరానికి మించి వాడితే ఇబ్బందులు తప్పవని తెలిపారు. జల శక్తి అభియాన్ గురించి వివరించారు. గ్రామస్తులకు ఇంకుడు గుంతల ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: