మన్యంటీవి, అశ్వారావుపేట: గిరిజనుల రిజర్వేషన్ పై పార్లమెంట్ సాక్షిగా గిరిజనులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రధాని మోది మరియు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను పార్టీ శ్రేణులు మరియు గిరిజనులతో కలిసి దగ్ధం చేసినా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా గిరిజనుల రిజర్వేషన్ పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండి పడ్డారు, ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుంటే కేంద్ర ప్రభుత్వం గిరిజనులను కించపరుస్తూ ఉండటం సరికాదని గిరిజనుల మనోబావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే ఊహించని విధంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే బిల్లుని ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల, నాయకులు, కార్యకర్తలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: