CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చదువుల తల్లికి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అండ.

Share it:

 



మన్యం టీవీ చర్ల:


ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్ల మండల కేంద్రంలోని విజయ్ కాలనీ చెందిన మత్తె దుర్గారావు మాధవి ల ప్రథమ పుత్రిక మత్తె కళ్యాణి ఇటీవల జరిగిన నీట్ పరీక్షలలో 503 మార్కులతో 1763వ ర్యాంకు సాధించి, ఎంబీబీఎస్ సీటుకు ఎంపిక అయింది.ఆమె ఫీజు చెల్లించే పరిస్థితిలో లేరు ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన వంతు గా చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.విద్యార్థుతోపాటు వారి కుటుంబ సభ్యులను ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది. కడు పేదరికంలో అనేక సవాళ్లు దాటుకొని ఎం బి బి ఎస్ సీటు సాధించిన మత్తె కళ్యాణి లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని రేగా కాంతారావు పేర్కొన్నారు.కృషితో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చునే ఈ విషయాన్ని కళ్యాణి నిరూపించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు, ఎంబిబిఎస్ లోనూ ప్రతిభ చాటాలని ఆశీర్వదించారు. అండగా నిలిచిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుకి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోచర్ల మండలం నుంచి చర్ల పీఏసీఎస్ అధ్యక్షులు పరుచూరి రవి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజారావు, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణ, బండి వేణు అజీజ్ పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: