మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: అశ్వాపురం తాసిల్దార్ వి సురేష్ కుమార్ మంగళవారం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా అవతారం ఎత్తారు. తాసిల్దార్ గొంది గూడెం ఆశ్రమ పాఠశాల సందర్శించారు సందర్శనలో భాగంగా పదవ తరగతి తరగతి గదిలోకి ప్రవేశించారు. విద్యార్థులను పరిచయం చేసుకున్నారు. అనంతరం విద్యార్థులుకు ఉన్న వారి వారి సామర్థ్యాన్ని తాసిల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా బ్లాక్ బోర్డ్ పై పాఠాలను రాసి విద్యార్థులకు బోధించారు.పాఠ్యాంశాలకు సంబంధించిన పలు విషయాలను బోధించారు త్వరలో జరగనున్న పదవతరగతి కామన్ పరీక్షల్లో విద్యార్థులు పాటించాల్సిన మెలుకువలు గురించి వివరించారు.
Post A Comment: