గుండాల/ ఆళ్ల పల్లి మార్చి 25(మన్యం మనుగడ) టిఆర్ఎస్ భారీగా చేరికలు శుక్రవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో ఆళ్ల పల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామానికి చెందిన 40 కాంగ్రెస్ పార్టీకి కుటుంబాలు సమక్షంలో పార్టీలో చేరారు. వీరిని రేగా కాంతారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చేరిన వారు మాట్లాడుతూ రేగా నాయకత్వంలో పినపాక నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, యువజన విభాగం అధ్యక్షులు సతీష్, సమ్మయ్య , కీసరి నరేష్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: