గుండాల/ఆళ్ల పల్లి మార్చ్5( మన్యం మనుగడ) మండలం పరిధిలోని రాయి పాడు గ్రామం లో సి సి రోడ్డు పనులను ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలోని అంతర్గత రోడ్లకు మహర్దశ వచ్చిందన్నారు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎన్ఆర్ఈజీఎస్ నిధులను మండలానికి పెద్ద మొత్తంలో మంజూరు చేయించినట్లు అన్నారు. మండలంలో ఇప్పటికే 9 సి సి రోడ్డు మంజూరై పనులు ప్రారంభం అయినా అన్నారు. మిగతా అంతర్గత రోడ్లను గుర్తించి నిధులను మంజూరు చేయించుకుంటానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, జెడ్ పి టి సి హనుమంతరావు, సర్పంచ్ ఉకే ఈశ్వరి,పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, మాజీ ఎంపీపీ పాపారావు, నాయకులు కిషోర్ బాబు, బద్రు, రఘుపతి, నాగేష్ , హైమావతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: